విజయనగరం లో పొకిరీల ఆగడాలు అధికం అవుతున్నాయనటానికి రాత్రి 09.30 గంటల సమయంలో జరిగిన ఘటనే ఓ నిదర్శనం. స్టేషన్ లలో పొద్దున్న నుంచీ పలు కేసుల విచారణ… డీఎస్పీ మీటింగ్ లతో బిజీబిజీగా ఉన్న టూటౌన్ పోలీసులు, రూరల్ పోలీసులు.. ఇంటికి వెళుతున్న సమయంలో…. పోకిరీలు ఆగడాలు కళ్ల ముందు కనిపించాయి.నగరంలో వెంకట లక్ష్మీ థియేటర్… అదే నాయుడు ఫంక్షన్ హాల్ వద్ద… నలుగురు ఆకతాయి లు..మైనర్లు…. వేసిన పిచ్చి వేషాలు వేస్తుండగా…విధుల నుంచీ ఇంటికి వెళుతున్న… టూటౌన్ పోలీసులు… గంట్యాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు ఆ ఆకతాయిల పిచ్చి వేషాలు కనిపించడం…అదే సమయంలో “సత్యం న్యూస్. నెట్ ” ప్రతినిధి కెమెరాకు చిక్కడంతో క్లిక్ మనిపించారు.వెంటనే పోలీసులు అలెర్ట్ అయి…తీయోద్దని చెప్పారు కూడా. అయినా నడిరోడ్డుపై రాత్రి పదిగంటల ప్రాంతంలో…అదీ పోలీసులు ముందే జరగడంతో… వాళ్ళు సీరియస్ గా తీసుకుని… ఆకతాయిలకు…కాస్త దేహశుద్ది చేసి…వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
previous post
next post