పంచాయతీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్పీ రాజకుమారీ సంబంధిత స్టేషన్ల అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.
అంతేకాక…కొన్ని స్టేషన్ల పరిధులతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఆకస్మిక వాహన తనిఖీలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా కొమరాడ మండల కూనేరు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రాజకుమారి, తనిఖీ చేసి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.