ఏదైనా ఘటన జరిగినప్సుడు…తక్షణం ఘటనా స్థలంలో ఉండేది పోలీసులే. న్యాయ,అన్యాయాలు…నిజానిజాలు కనుక్కోవడంతో పాటు ప్రమాదం జరిగినా..ఏదైనా ఘోరం జరిగినా…సకాలంలో ముందుగా ప్రత్యక్షమయ్యేది పోలీసులు.
విజయనగరం జిల్లా చెల్లూరు సమీపంలో జరిగిన ప్రమాదంలోనూ జరిగింది.రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొనడంతో..హుటాహుటిన డీఎస్పీ అనిల్ తో పాటు విజయనగరం రూరల్ సీఐ మంగవేణి ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఎస్పీ సమక్షంలోనే ఓ వైపు డీఎస్పీ అనిల్ మరోవైపు రూరల్ సీఐ మంగవేణిలు…క్షత గాత్రులను తరలించడం…ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం వంటి చర్యలలో నిమగ్నమైనారు. పోలీసు అంటే ఆ మాత్రం ఉండాలనుకోండి. కానీ…సకాలంలో స్పందించిన ఈ ఇద్దరు పోలీసులుకు…ఈ దారుణ ఘటన బహుశా మరచిపోలేరేమో.
ఎందుకంటే….ఆర్టీసీ బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు లాగడంతో శాయశక్తులా డీఎస్పీ అనిల్ ప్రయత్నించారు.ఈ క్రమంలోనే తన కాళ్ల వద్ద మొత్తం రక్తం అంటుకుంది కూడా. అది చూసిన ఎవ్వరైనా ప్రమాదంలో ఈ పోలీస్ అధికారికి కూడా ఏమైనా జరిగిందా అన్న సందేహాలు కలగక మానదు.
ఇక రూరల్ సీఐ మంగవేణికి ఎప్పుడూ కళ్లద్దాలు పెట్టుకునే ఉంటారు. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను అలాగే ట్రాఫిక్ ను క్రమబద్దీ కరించే చర్యల్లో భాగంగా తన కళ్ల జోడు ఎడమ లెగ్ ఊడిపోయినా… కర్తవ్యమే ముఖ్యమంటూ…డ్యూటీలో పాల్గొన్నారు.
అటు డీఎస్పీ,ఇటు సీఐ లు ఇద్దరూ నిబద్దతతో పని చేసారటానికి ఈ దృశ్యాలే అందుకు తార్కాణం.