రాష్ట్ర పోలీస్ శాఖాధిపతి ఆదేశాలో లేక…ఇటీవలే విశాఖ రేంజ్ డీఐజీ పర్యటనా ఫలితమో ఏమో గాని వరుసగా మూడో రోజూ కూడా రాష్ట్రంలోని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ ఆకస్మికంగా జిల్లా కేంద్రంలో పర్యటించారు.
ఈ సందర్బంగా మరోసారి ప్రజలకు కచ్చితమైన హెచ్చరికలు జారీ చేసారు. కొనసాగుతున్న పది రోజుల లాక్ డౌన్ సందర్భంగా కర్ఫ్యూ సమయంలో విచ్చలవిడిగా అ కారణంగా రోడ్ మీద తిరుగుతున్నవారికి ఎస్పీ మరోసారి హెచ్చరకలు జారీ చేసారు.
ఉదయం 6 గంటల నుంచీ 12 గంటలకు కర్ఫ్యూ సడలింపు ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసినా అనవసరంగా రోడ్ల మీదకు రాకూడదన్నారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మరోసారి ఎస్పీ పర్యటించిన మైక్ ల ద్వారా ముఖ్యమైన జంక్షన్ల వద్ద ప్రజలను హెచ్చరించారు.
పన్నెండులోపే తమ,తమ ఇండ్లకు ప్రతీ ఒక్కరూ చేరుకోవాలన్నారు.ఆ రకంగా పని చేస్తున్న కంపెనీ వద్ద అనుమతులు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులైతే..సంబంబందిత హెచ్ఓడీ నుంచీ లెటర్ చూపించాలన్నారు. నగరంలో ఆకస్మిక పర్యటన సందర్బంగా ఐస్ ఫ్యాక్టరీ వద్ద అటు వాహనదారులకు ఇటు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు.