పాఠశాల చిన్నారిని తండ్రి వద్దకు చేర్చిన పీసీ..!
ఇంతవరకు మీరు పోలీసులలో అదీ లా అండ్ ఆర్డర్ పోలీసుల్లో “కాపాడే” గుణం..చూసింటారు. కానీ “సత్యం న్యూస్. నెట్ ” ప్రతినిధి చెప్ప బోయే వార్త చదవితే…ఆశ్చర్యం వ్యక్తం చేయకమానరు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్…నిరంతరం రోడ్ పై వచ్చే పోయే వాహనాలను క్రమబద్ధీకరించడమే మనకు తెలుసు. కానీ సమయానుకూలంగా… విధుల్లో వ్యవహరించి… పని చేస్తున్న శాఖకే పేరు తెచ్చి పెట్టారు… ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్.
వివరాల్లోకి వెళితే… విజయనగరం లో రైల్వే స్టేషన్ ప్రాంతంలో… ఓ పాఠశాల విద్యార్ధిని తచ్చాడటాన్ని గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం… వివరాలు కనుక్కున్నాడు. అసలే ఆ రైల్వే ప్రాంతంలో చిన్నారులచే గంజాయి అమ్మకం జరగడం… ఇటీవలే వన్ టౌన్ పోలీసులు.. ఆ బండారాన్ని బయట పెట్టడం జరిగింది.
ఈ క్రమంలో.. అక్కడే ఆ చిన్నారి ఎవరికోసమో చూడటం…ముఖంలో ఆందోళన.. తన వారికోసం ఎదురు చూస్తున్న వైనాన్ని గుర్తించిన పీసీ సింహాచలం… వెంటనే పాప వివరాలు కనుక్కుని..తన తండ్రి వద్దకు అదే గంట్యాడ వద్దకు వెళ్లి పోతానని చెప్పడంతో.. వన్ టౌన్ పీఎస్ కు…తన బండిపై తీసుకుని వెళ్లి… సీఐ డా.వెంకటరావు కు అప్పచెప్పాడు.ఇదే విషయాన్ని “సత్యం న్యూస్. నెట్ ” ప్రతినిధి… కానిస్టేబుల్ ను సంప్రదించగా…డీఎస్పీ ఆదేశాలతో…తానీ పని చేసానని… ఆయన ఇచ్చిన సూచనలు చిన్నారిని.. పోలీసులకు అప్పగించానని చెప్పారు.