మీరు చదివింది నిజమే.. విజయనగరం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఉప ఎన్నికల్లో బందోబస్తు తో పాటు సేవా నిరతి ని కూడా పోలీసులు కనబరుస్తున్నారు. ఈ మేరకు… జిల్లాలో జరుగుతున్న 9 ఎంపీటీసీ స్థానాలకు నిర్దేశించిన పోలింగ్ బూత్ లలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి… సమక్షంలో సంబంధిత రెవెన్యూ సిబ్బంది ఏర్పాట్లు చేయడంతో ఈ ఉదయం సరిగ్గా ఏడుగంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
పనిలో పనిగా..జరుగుతున్న తొమ్మిది ఎం.పీ.టీ.సీ. స్థానాల ఉప ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.అలాగే పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఆయా పోలింగు కేంద్రాల వద్ద జిల్లా దీపికా ఆదేశాలతో పోలీసుశాఖ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కూడాను. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కొనేందుకు క్రమ పద్దతిలో పోలింగు కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.కాగా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు నడవలేని, ఓటు వేయలేని ఓటర్లకు తోడుగా ఉంటూ స్థానిక పోలీసులు వారికి సహాయాన్ని అందిస్తూ తమలి ఉన్న సేవా నిరతిని చూపిస్తున్నారు.. ఫలితంగా శాఖ కే పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం