విజయనగరం జిల్లా సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నగర సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి..తమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. ఈ సందర్భంలో డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ విజయనగరం లో రైతు భరోసా కేంద్రానికి ఏర్పాటు చేయాలన్నారు. ఆర్బీకే ఏర్పాటు చేయాలని.. గతంలో ప్రతిపాదనలు పంపామని..ఇంతవరకు ఆచరణ కు అమలు కు నోచుకోలేదని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. ఈ ప్రతిపాదనపై ఓ తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు. వెంటనే డిప్యూటీ సీఎం తో పాటు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు.