విజయనగరం జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తో కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే అని చెప్పాలి.
అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు వందలకు చేరిన ఆ కేసులు సోమవారం ఆ సంఖ్య కాస్త తగ్గి 87కు చేరుకున్నాయి.
అయితే మాస్క్ లు పంపిణీ చేస్తున్నా ఏ ఒక్కరూ మాస్క్ లు ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు…జిల్లా ఎస్పీ.
ఈ మేరకు మరోసారి నగర రోడ్డుపై మాస్క్ ల అవేర్నస్ కార్యక్రమం చేపట్టారు.
మరీ ముఖ్యంగా కోట జంక్షన్ వద్ద కాలేజీ విధ్యార్ధులకు ఎస్పీ రాజకుమారీ క్లాస్ తీసుకున్నారు.
రోడ్డు మీదకు వస్తున్న యువత..ముఖ్యంగా అతి జాగ్రత్తగా ఉండాలని మీరే మీ ఇండ్లలోకి కరోనా ను తీసుకెళుతున్నారని..ఎస్ఎంఎస్ తప్పకుండా పాటించాలి ఎస్పీ విద్యార్థులకు “క్లాస్” తీసుకున్నారు.