ఎన్నో సంచలనాలకు,మరెన్నో కథనాలకు పకడ్బందీ జర్నలిస్టులతో ఎప్పటికప్పుడు తాజా న్యూస్ లను అందిస్తున్న సత్యం న్యూస్.నెట్ ముందుగా చెప్పినట్టే విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్న దిశ డీఐజీగా పదోన్నతి కల్పించింది ప్రభుత్వం.
ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ దాదాపు 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కొద్ది నెలల క్రితమే రాష్ట్రంలో ఐపీఎస్ లకు స్థానం కలుగుతుందని…అందులో విజయనగరం జిల్లా ఎస్పీకి బదిలీ తప్పదని ఆన్ లైన్ న్యూస్ సైట్ లలో దూసుకెళుతున్న సత్యం న్యూస్.నెట్ చెప్పకనే చెప్పింది.
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఎస్పీ రాజకుమారి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు కరోనా సమయంలో జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు చేయడమేకాకుండా క్షణం తీరిక లేకుండా ఓ లేడీ ఎస్పీగా సేవలంచిందినందకు గానూ కేంద్ర ప్రభుత్వం అదీ కేంద్ర సమాచార,ప్రసారశాఖమంత్రి ప్రకాష్ జవేదకర్ చేతులు మీదుగా ఉత్తమ లేడీ ఎస్పీ అవార్డు కూడ ఆందుకున్నారు.
ఇక జిల్లా ఎస్పీగా 2019 జూన్ 14 చార్జ్ తీసుకున్న రాజకుమారీ రెండేళ్ల పూర్తయింది. అప్పుడే సత్యం న్యూస్.నెట్ ఎస్పీ రాజకుమారీకి అవుతుందని, తదుపరి ఎస్పీగా దిశ ఎస్పీ దీపిక పాఠిల్ వస్తారని ముందుగాన చెప్పింది.
గత అర్ధరాత్రి సీఎస్ ఆధిత్య నాద్ దాస్ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ పేరు ఉండటం అందులోదిశకు డీఐజీగా పదోన్నతి కల్సించడంతో సత్యం న్యూస్.నెట్ రాసిందే నిజమైంది. ఏదైనప్పటికీ జిల్లా ఎస్పీగా రాజకుమారీ చేసిన సర్వీసులను అటు శాఖ,ఇటు ప్రజలను ఎప్పడూ మర్చిపోరంటోంది…సత్యం న్యూస్.నెట్.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్