ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాను ఒక్క రోజు ముసురుపట్టుకుంది. ఉదయం నుంచీ వర్షం పడుతూ సాయంకాలానికి ఆ ముసురు తగ్గింది.
వాస్తవానికి 3 వ తేదీన జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఓ గంటసేపు నగరంలో వర్షం భీభత్సం సృష్టించింది. మరుసటి ఉదయం ఎనిమిదింటి వరకు ఆకాశం మేఘావృతం గా ఉన్నా అక్కడనుంచీ వాన మొదలైంది.చినుకు,చినుకు పడుతూ ముసురుగా మారింది.
దీంతోపొద్దునుంచి సాయంకాలం ఆరున్నర వరకు వర్షం పడుతూనే ఉంది. విజయనగరాన్ని ఒక్కసారి గా కమ్మిన ముసురువాతావరణనాన్ని చిత్రీకరించేందుకు సత్యం న్యూస్.నెట్ ప్రతినిధి నగరంలో తడుచుకుంటూనే పోటోలు తీసే యత్నం చేసారు.
ఈ క్రమంలో ప్రదాన జంక్షన్ అయిన ఎస్పీ బంగ్లా ఉండే మయూరీ జంక్షన్ వద్ద రెగ్యులర్ గా ఉండాల్సిన కానిస్టేబుల్ కనిపించలేదు. అలాగే మరో ప్రధాన రద్దీగా ఉండే మూడు లాంతర్ల జంక్షన్ వద్ద ట్రాఫిక బీట్ వద్ద కానిస్టేబుల్ కనిపించలేదు.
ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్స్ లేకపోవడంతో ఎవరు నచ్చిన విధంగా వారు వాహనాలను నడపటం మరోవైపు ముసురు పడుతున్న సమయంలోనే ఎంత వేగరంగా ఇంటికి వెళిపోదామన్న ఆలోచనలోనే ఎవరికి నచ్చిన విధంగా వాహనం నడపడం సత్యం న్యూస్.నెట్ కెమారాకు చిక్కింది.
ఇక మిగిలిన జంక్షన్ లు అయిన వై జంక్షన్,ఎత్తుబ్రిడ్జి,బాలాజీ గంటస్థంబం వద్ద వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్లు రెయిన్ కోట్ ధరించి మరీ ట్రాపిక్ ను క్రమబద్దీకరించడం సత్యం న్యూస్.నెట్ కెమారకు కనిపించడంతో క్లిక్ మనిపించాడు.
మరో విశేషమేంటంటే.. సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎస్పీ రాజకుమారి తన బంగ్లా నుంచీ ఎత్తు బ్రిడ్జి మీదుగా వై జంక్షన్ వైపు వెళ్లినట్టు ఆయా జంక్షన్ లలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు చూసి తడుస్తునే ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం మరింత విశేషం.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్