30.2 C
Hyderabad
February 9, 2025 20: 32 PM
Slider ముఖ్యంశాలు

డీజీపీ నుంచీ అవార్డ్ అందుకున్న విజయనగరం ఎస్పీ

#dwarakatirumalarao

డిసెంబరు 14న జిల్లాలో ముగిసిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన జిల్లాగా విజయనగరం పోలీసుశాఖ ద్వితియ స్థానం సాధించిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. లోక్ అదాలత్లో 5,345 కేసులను పరిష్కరించుటలో క్రియాశీలకంగా పని చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మరియు భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, డిసిఆర్బి ఎస్ఐ కే.రాజేష్, నెల్లిమర్ల హెడ్ కానిస్టేబులు కే.సన్యాసి నాయుడు, టూటౌన్ కానిస్టేబులు ఐ.శ్రీనివాసరావు లను రాష్ట్ర డీజీపీ  సిహెచ్. ద్వారకా తిరుమలరావు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

ఇదే విషయంపై జిల్లా ఎస్పీ వకుల్ జిందల్”సత్యం న్యూస్. ఇన్”ప్రతినిధికి ఈ విషయాన్ని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, లోక్ అదాలత్లో పరిష్కారానికి అర్హత కలిగిన కేసులను ముందుగా గుర్తించి, ఆయా కేసుల్లో ఫిర్యాదిదారులు మరియు కక్షిదారుల మధ్య సమన్వయం సాధించేందుకు క్షేత్ర స్థాయిలో చక్కని ప్రణాళితో పని చేసామన్నారు. న్యాయస్థానాల విలువైన సమయాన్ని ఆదా చేయడంతోపాటు, స్వల్ప వివాదాలు, క్షణికావేశంపై నమోదైన కేసుల్లో ఇరు వర్గాలను ఈ నెల 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ప్రవేశ పెట్టారు. కోర్ట్ ముందు హాజరై, ఇరువర్గాలు రాజీ పడినట్లుగా వెల్లడించడంతో 5345 కేసులను పరిష్కరించామన్నారు.

వివిధ పోలీసు స్టేషనుల్లో ఎఫ్.ఐ.ఆర్.లుగా నమోదైన 1192 కేసులతో సహా, 4153 ఎన్ఫోర్సుమెంటు కేసులను మొత్తం 5345 కేసుల పరిష్కరించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని, జిల్లాను అన్ని రంగాల్లోను ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ మెగా లోక్ అదాలత్లో 17,138 కేసులు డిస్పోజ్ కాగా, వాటిలో విజయనగరం జిల్లా పోలీసులు 5345 కేసులను డిస్పోజ్ చేసి, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ప్రధమ స్థానంలో కర్నూలు జిల్లా, తృతియ స్థానంలో కృష్ణా జిల్లాలు నిలిచాయి.ఈ కార్యక్రమంలో సీఐడీ అధిషనల్ డీజీ డా. రవిశంకర్ అయ్యాన్నార్, లా అండ్ ఆర్డర్ ఐజీ  సీహెచ్.శ్రీకాంత్, ఈగల్ ఐజీ  ఆర్కె రవికృష్ణ, రైల్వే మరియు స్పోర్ట్స్ ఐజీపీ కే.వి.మోహనరావు పాల్గొన్నారు.

Related posts

సూర్య ప్రభ వాహనం పై మాడ వీధుల్లో శ్రీ సౌమ్యనాధ స్వామి దర్శనం

Satyam NEWS

మధ్యప్రదేశ్ లో ఎన్నికల సన్నాహాలు: భారీగా పోలీసు బదిలీలు

mamatha

వక్ఫ్ బోర్డు అధికారులకు కనువిప్పు కలగాలని అల్లాకు వినతి

Satyam NEWS

Leave a Comment