ఆకస్మిక తనిఖీ లలో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు బాస్…ఎస్పీ దీపికా, విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సాయంత్రం… ఏడుగంటల ప్రాంతంలో… రూరల్ పీఎస్ ఉన్న ప్రాంతం…కంటోన్మెంట్ ఎస్.బీ.ఐ దగ్గర… రైతు బజార్ ప్రాంతం…రద్దీ గా హెవీ రెష్ నడుమ…. విజయనగరం రూరల్ పీఎస్ ను చడీ చప్పుడు లేకుండా ముందు గా సమాచారం ఇవ్వకుండా… విజిట్ చేశారు.
ఆ సమయంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ తిరుపతి రావు లేకపోవడంతో… స్టేషన్ ఎస్ఐ గణేష్… ఎస్పీ కి వార్మ్ వెల్కమ్ చెప్పి…స్టేషన్ పరిసరాలను చూపించారు. ఈ సందర్భంగా స్టేషనును జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆకస్మికంగా స్టేషన్ ను సందర్శించి, స్టేషను రికార్డులు, సీడీ ఫైల్స్ పరిశీలించారు. స్టేషను ప్రాంగణం, ప్రాపర్టీ గదులను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్టు విచారణలో ఉన్న లాంగ్ పెండింగు కేసుల్లో ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా జ్యుడిషియల్ అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషను సిబ్బందితో జిల్లా ఎస్పీ దీపికా మమేకమయ్యారు, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్ , ఏఎస్ఐ లు ఇతర పాల్గొనగా, ఎస్ఐ నమోదైన కేసుల ప్రగతిని జిల్లా ఎస్పీ వివరించారు.