మరి కొద్దిరోజుల్లో పదోన్నతిపై బదిలీ కాబోతున్న ఏపీలోని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ మరోసారి జిల్ల కేంద్రమైన విజయనగరంలో ఆకస్మికంగా పర్యటించారు.కనీసం తన గన్ మెన్ గాని..పీఆర్ ఓ విభాగానికి గాని చెప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేయడంతో ఎస్పీ దిట్ట. బంగ్లా నుంచీ బయటకు వెళ్లాలంటే…వెహికిల్ సిద్దం చేయండి అని మాత్రమే ఆ సమయంలో డ్యూటీ నిర్వహిస్తున్న డ్రైవర్ కు చెబుతారు.ఇక అక్కడ నుంచీ ఎటువైపు వెళతారా….అప్పటికప్పుడు ఎస్పీ తీసుకునే ఎస్పీ చెప్పే ఆదేశాలపైనే అటు డ్రైవర్ గాని ఇటు గన్ మెన్ లు గాని సిద్దమవుతారు.
తాజాగా ఎస్పీ…నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ కు వచ్చారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీసీఎస్ సీఐ కాంతారావును పిలిచి..లాక డౌన్ అమలు,కర్ఫ్యూ నిబంధనల అమలుపై ఆరా తీసారు. పకడ్బందీగా కర్ఫ్యూ సందర్భంగా ఏ ఒక్కరినీ లాక్ డౌన్ సమయాలలో రోడ్ల మీదకు రానివ్వొద్దని ఆదేశించారు.
అక్కడ నుంచీ రింగ్ రోడ్ మీదుగా…ఐస్ ఫ్యాక్టరీ, అయోద్యామైదానం,జొన్న గుడ్డి మీదుగా బయలు దేరారు.జొన్నగుడ్డి ప్రాంంతంలో కొందరు యువకులు రోడ్ మీదే ఉంటూ మాస్క్ లు లేకుండా ఉండటాన్ని గుర్తించి తన గన్ మెన్ చే వాళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేయించారు.
అంతకుముందు రింగ్ రోడ్ మీద మోర్ మార్కెట్ వద్ద..మామిడి పండ్లు అమ్మే ప్రదేశంలో మహిళంతా మాస్క్ లు లేకుండ,.గుమి గూడి ఉండటాన్ని చూసిన ఎస్పీ…వాళ్ల తగిన విధంగా హెచ్చరించారు. ఇక జొన్నగుడ్డి నుంచీ కోట జంక్షన్,మూడులాంతర్లు, గంటస్థంబం వద్ద కు వచ్చి కాస్సేపు సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. అక్కడే ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్ రావును ఎస్పీ..ట్రాఫిక్ మళ్లింపు,లాక్ డౌన్ సందర్భంగా…కొత్తగా పెట్టిన హర్డిల్స్ పై చర్చించారు. అక్కడ నుంచీ సరాసరి డీపీఓకు వెళ్లిపోయారు.