విజయనగరం జిల్లాలో పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ ఎన్నికల పోలింగ్… ప్రారంభమైంది. ఉదయం 6.30కే పోలింగ్ ప్రారంభమైంది.
ఈ మేరకు పార్వతీపురం డివిజన్ లో రెండో విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సాలూరు, పి.కోనవలస, మామిడిపల్లి, జీగిరామ్ పోలింగు కేంద్రాలను ఎస్పీ రాజకుమారీ సందర్శించారు.
భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. ఎస్పీతో పాటుపార్వతీపురం ఓఎస్డి సూర్యచంద్ర రావు, ఎ ఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ వెంట ఉన్నారు.