రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ…అన్న నానుడి… ఈ హెడ్డింగ్ చదివితే మీకు గుర్తొస్తోంది కదూ…మీరు చూసి చదివింది నిజమేనండీ. జయనగరం జిల్లాకు కొత్తగా మళ్లీ లేడీ ఎస్పీ వచ్చారన్న సంగతి తెలిసిందే.
ఆమె ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు సూచనల మేరకు నగర రోడ్లపై హెల్మెట్లు, మాస్క్ లు, లైసెన్స్ లు లేని వాహనదారుల కోసం ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించాలని వచ్చిన ఆదేశాలు దరమిలా విజయనగరంలోని ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు భాస్కర రావు, దామోదరరావు, హరిబాబులు… ప్రధాన జంక్షన్ లలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
గత వారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ దామోదరరావు వాహనాల తనిఖీలు చేయగా..రెండు రోజుల క్రితమే మరోఎస్ఐ హరిబాబు తనిఖీలు నిర్వహించారు.
తాజాగా గంటస్థంభం న్యూపూర్ణ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు తనిఖీలు చేపట్టారు. ఒకే ఒక గంట వ్యవధిలో దాదాపు 34 వేల రూపాయలు చలానాల రూపంలో వాహనదారులతో కట్టించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారు.
విషయం తెలుసుకున్న వారు ట్రాపిక్ సిబ్బంది పనితీరు ను శభాష్ పోలీస్ అని ప్రశంసిస్తున్నారు…దీంతో సత్యం న్యూస్.నెట్ కూడా ట్రాఫిక్ ఎస్ఐల పనితీరుకు సలాం చేస్తోంది…హ్యేట్సాప్