పత్రికలలో లేదా మీడియా లో వచ్చిన వార్తలకు ప్రజాప్రతినిధులు ఏమోగానీ అధికారులు మాత్రం తక్షణమే స్పందిస్తారు.అందులో పోలీసు శాఖలో.ప్రత్యేకించి విజయనగరం జిల్లాపోలీసు బాస్ దీపికా మరీ ప్రత్యేకంగా స్పందిస్తారు. ఆ వార్త.. ఎందులో వచ్చింది.. ఏ పేపర్లో వచ్చింది.. ఏ ఛానెల్ లో వచ్చినా గాని సమస్యల పట్ల తక్షణం స్పందిస్తారు. అందుకు ఉదాహహరణ…ఆర్.అండ్ బాధ్యత జంక్షన్ సమీపంలో పతంజలి స్టోర్స్ వద్ద బ్యారికేడ్లు పెట్టించడమే.స్వయానా ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు…రంగంలో కి దిగి…ఎస్ఐలు భాస్కరరావు, హరిబాబు తో దగ్గరుండి స్టాపర్స్ పెట్టించారు.విశాఖ నుంచీ కలెక్టరేట్ వెళ్లే ఆ రహాదారి..మలుపు ఉండటం.. ఇటీవలే ప్రమాదాలు జరిగి…ఓ తల్లి కొడుకు దుర్మరణం చెందడం… అదీ కాస్త పోలీసు బాస్ దృష్టిలో పడటం…ఉదయం నిర్వహించే సెట్ కాన్ఫరెన్స్ లో ట్రాఫిక్ డీఎస్పీకి అక్షింతలు పడటం వెనువెంటనే మొత్తం ట్రాఫిక్ వింగ్ రంగంలో కి దిగి పరిష్కారం చర్యలు చేపట్టడం అన్ని ఒక్క రోజు లో జరిగిపోయాయి.ఇదే కలం బలం..అంటే.
previous post