విజయనగరం జిల్లా కేంద్రం లో ప్రభుత్వ పరంగా నిర్వహించిన కార్యక్రమంలో అటు రెవిన్యూ, ఇటు పోలీసుల మధ్య సమన్వయం లోపించింది.
పర్వవసానంగా విజయనగరం లో కోట జంక్షన్ నుంచీ దాసన్నపేట రింగ్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కొద్ది సేపు స్తంభించింది. మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో బాగంగా నగరంలో విద్యావాలంటీర్లు ,ఆరోగ్య కార్యకర్తలతో కోట జంక్షన్ నుంచీ అయ్యకోనేరు గట్టు వరకూ ర్యాలీ జరిగింది.
ఈ ర్యాలీ సందర్భంగా దాసన్నపేట రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆ మార్గంలో కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే ట్రాఫిక్ పోలీసులు లేక పోవడంతో అయ్యకోనేరు గట్టు వద్ద సభ జరుగుతున్నంత సేపు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.