విజయనగరం జిల్లాలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు..అటు రెవిన్యూ,ఇటు పోలీసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
నిన్న కాక మొన్ననే విజయనగరం సబ్ డివిజన్ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ రాజకుమారీ…తాజాగా డెంకాడ, పూసపాటి రేగ పోలీస్ స్టేషన్ పరిధులలో పర్యటించారు.
ఆ రెండు స్టేషన్ల ప్రాంతాలలో ఉన్న రెల్లివలస గుణుపురు పేటలలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కల్పించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్నికల అధికారులు…, భద్రతా అధికారులకు అలాగే తమ శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అప్పటికే సమాచారం అందుకున్న భోగాపురం సీఎం శ్రీధర్..డెంకాడ, పూసపాటిరేగ ఎస్ఐలను అలెర్ట్ చేయించడంతో…సిబ్బంది అంతా ఎస్పీ ఆకస్మిక తనిఖీలకు హాజరయ్యారు.