వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా విచారించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయనను ప్రశ్నిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
వివేకానందరెడ్డి చనిపోయిన వార్త తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు విజయసాయి వెళ్లారని, గుండెపోటుతో మృతి చెందారని ఆయన ప్రకటించారని వెంకన్న అన్నారు.
వివేకా ఒంటిపై కత్తిపోట్లు కనిపిస్తున్నా.. గుండెపోటుతో మరణించారని, తర్వాత హత్య అని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.