37.2 C
Hyderabad
March 29, 2024 18: 12 PM
Slider కృష్ణ

వివేకా హత్య కేసులో విజయసాయిని విచారించాలి: బుద్దా వెంకన్న

#budha venkanna

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా విచారించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయనను ప్రశ్నిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 

వివేకానందరెడ్డి చనిపోయిన వార్త తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు విజయసాయి వెళ్లారని, గుండెపోటుతో మృతి చెందారని ఆయన ప్రకటించారని వెంకన్న అన్నారు.

వివేకా ఒంటిపై కత్తిపోట్లు కనిపిస్తున్నా.. గుండెపోటుతో మరణించారని, తర్వాత హత్య అని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

Related posts

సండే స‌ర‌దాగా.. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్

Sub Editor

నిబంధనలు పాటిస్తే  ప్రమాదాలు తగ్గించవచ్చు

Murali Krishna

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS

Leave a Comment