34.2 C
Hyderabad
April 19, 2024 22: 11 PM
Slider ముఖ్యంశాలు

పాలనలో విఫలమైన వారు చంద్రబాబుకు పాఠాలు చెబుతారా?

#SudhakarReddy15

అభివృద్ధికి అర్థం చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబుకు మార్పును గూర్చి వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి చెప్పడం విడ్డూరంగా వుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలపై 16 నెలలు జైలులో గడిపి బెయిలుపై వున్న విజయసాయి రెడ్డికి మార్పుకు అర్థం తెలుసా అంటూ ఎద్దేవా చేశారు.

మార్పు అంటే జ్ఞానం, పరివర్తన అన్న విషయం విజయసాయి గుర్తించాలని హితవు పలికారు. ” ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో  తెలియదంట” అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడాన్ని సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు.

చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారన్న విషయం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. నీడలా వెంటాడుతున్న ఈడీ , సిబిఐ కేసులకు భయపడి, మతిచెడిన విజయసాయి అసంబద్దంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

అడ్డదారిలో రాజ్యసభకు

ఎన్నికైన  అవినీతి చక్రవర్తికి గెలుపు, ఓటములను గూర్చి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు సంక్రాంతి ముగ్గు అయితే విసా రెడ్డి గోడకు కొట్టిన పిడక లాంటి వాడని చెప్పారు. రాష్ట్రంలో సాగుతున్న భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు బాస్ అయిన విజయసాయి ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

చట్టవిరుద్ధంగా సంపాదించిన వ్యక్తి నీతివంతుడు, ధనవంతుడు ఏనాటికి కాలేడన్న విషయం వైకాపా నేతలు గుర్తించాలన్నారు. ఏదోవిధంగా ఆ సొమ్ము పరుల చేతికే వెళుతుందనేది చాణక్యనీతిని తెలిపారు. ఏపీలో లక్షల కోట్ల అక్రమ సంపాదన ఈడీ, సీబీఐ వశం చేసుకున్నది ఎవరివద్దో అందరికీ తెలుసన్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకు విగ్రహాల విధ్వంసాలు సృష్టించిన వైకాపా నేతలు పోలీసుల అండతో ఆ నేరాలలో టిడిపి కార్యకర్తలను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు నిర్మాణాత్మక రాజకీయలలో ఓనమాలు రాని విజయసాయి రెడ్డికి చంద్రబాబు గొప్పదనం ఎలా తెలుస్తుందన్నారు.

Related posts

వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో తెలంగాణ  ఫస్ట్

Murali Krishna

అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్

Satyam NEWS

తెలంగాణ రాష్ట్రం లో కుటుంబ పాలన సాగుతోంది…!

Satyam NEWS

Leave a Comment