విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికిరణ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయనతో పాటు మరో 25 మంది జూనియర్ డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. అదే విధంగా మరి కొందరు సీనియర్ వైద్యులకు పాజిటివ్ వచ్చింది. కొందరు పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు.
next post