దసరా శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఇంద్రకీలాద్రి లోని కనకదుర్గమ్మవారికి సారే సమర్పించారు. దసరా నవరాత్రులకు మొదటి సారె పోలీస్ శాఖ తరఫున సమర్పించడం అనవాయితీ. పోలీసు శాఖ సారె ఇచ్చిన దగ్గర నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం అవుతాయి. రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమ్మవారి దర్శనానికి రానున్నారు. దీని కోసం బందోబస్తు పూర్తి స్ధాయిలో నిర్వహించారు. దసరా నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు.