ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన ముఠా నాయకుడు వికాస్ దూబే ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బిక్రూ గ్రామంలో తనను పట్టుకునేందుకు వచ్చిన 8మంది పోలీసులను హతమార్చి పారిపోయిన కరడుకట్టిన నేరగాడు వికాస్ దూబే.
అతను మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ఉజ్జయిని నగరంలోని మహాకాళీ దేవాలయంలో పూజలు చేసేందుకు రావడంతో అక్కడి గార్డులు పట్టుకున్నారు. వికాస్ దూబేను పట్టుకున్న అనంతరం ఈ విషయాన్ని ఉజ్జయిని జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు.