27.7 C
Hyderabad
April 20, 2024 01: 33 AM
Slider నెల్లూరు

డాక్టర్ కె.రమేష్ రెడ్డి కి వి ఎస్ యూ అశ్రునివాళి 

#vikramUniversity

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, స్టేట్ ఎన్ ఎస్ ఎస్ కోర్డినేటర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి కోవిడ్ 19 కారణంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందారు.

ఆయన కుటుంబానికి ఇంచార్జి ఉపకులపతి కే. రాజశేఖర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆంధ్ర ప్రదేశ్  స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య కే హేమ చంద్ర రెడ్డి తమ  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా  విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయిర్, ఇతర అధ్యాపకులు,  సిబ్బంది సమావేశ మందిరంలో రమేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిముషాలు మౌనం పాటిస్తూ నివాళు  అర్పించారు.

రాష్ట్రము లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, మాజీ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు, రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య తమ నివాళులు అర్పించారు.

విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఇతర సిబ్బంది రమేష్ రెడ్డి మరణం తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు, వారి కుటుంబానికి తోడుగా నిలుస్తామని ప్రకటించారు.

Related posts

నరేంద్ర మోడీ ధర్మ పాలన ప్రపంచానికే ఆదర్శం

Satyam NEWS

వనపర్తిలో మేఘారెడ్డి ద్వారా విలేకరులకు ఇండ్ల స్థలాలు

Satyam NEWS

అమెరికా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు

Satyam NEWS

Leave a Comment