32.7 C
Hyderabad
March 29, 2024 10: 24 AM
Slider ఖమ్మం

గ్రామాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం: మంత్రి పువ్వాడ

#minister puvvada

టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు  బుధవారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి  విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు.

చంద్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. గానుగపాడు గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం మొక్కలునాటారు. రావికంపాడు గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనంను ప్రారంభించారు. రైతువేదిక ఆవరణంలో మొక్కలు నాటారు. తిప్పనపల్లి గ్రామంలో వైకుంఠధామం ప్రారంభించారు. అక్కడే మొక్కలు నాటారు.

చంద్రుగొండ మండలం కేంద్రంలో రైతువేదిక ను  ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , జడ్పీ సీఈవో విద్యాలత , పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

`స్వ‌` మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్‌

Satyam NEWS

గుడ్ బిగినింగ్: సిరిసిల్లా లో పట్టణ ప్రగతికి శ్రీకారం

Satyam NEWS

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ విడుదల

Satyam NEWS

Leave a Comment