36.2 C
Hyderabad
April 25, 2024 20: 15 PM
Slider నల్గొండ

గ్రామాల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

#MLA Sanapudi Reddy

గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపడమే తెరాస  ప్రభుత్వ లక్ష్యమని, రాష్టంలో పాడి రైతుల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి   తెలిపారు. హుజూర్ నగర్  మండలం అమరవరం గ్రామంలో ఆయన పశువైద్యశాల, సిసి రోడ్ల నిర్మాణం, ఖబ్రస్థాన్ ప్రహారీగోడ నిర్మాణపనులకి శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ పాడి రైతులకు , పాడి సంపదపై ఆధారపడి జీవిస్తున్న మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ZPTC కొప్పుల సైదిరెడ్డి, ఎం‌పి‌పి గుడెపు శ్రీను,  వైస్ ఎం‌పి‌పి చింతల సైదమ్మ ఆదినారాయణ రెడ్డి, సర్పంచ్ సుజాత అంజిరెడ్డి,  అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

అమరవరం లిఫ్ట్ నిర్వాహణకు కృషి

హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న MLA సైదిరెడ్డికి అమరవరం గ్రామస్థులు లిఫ్ట్ నిర్వాహణకు ప్రభుత్వ పరంగా సహాయం చేయవలసిందిగా కోరారు. దీనికి స్పందించిన సైదిరెడ్డి అమరవరం లిఫ్ట్ నిర్వాహణకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.

Related posts

మీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదంటూ మాస్క్ లు తొడిగిన ఎస్పీ…!

Satyam NEWS

ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు దీక్ష ఆరంభం

Satyam NEWS

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి మృతి

Bhavani

Leave a Comment