39.2 C
Hyderabad
April 25, 2024 18: 22 PM
Slider నల్గొండ

చర్చలు సఫలం కావడంతో పెరిగిన గ్రామీణ హమాలి రేట్లు

#CITUHujurnagar

శ్రమజీవులు ఐక్యంగా పోరాడితే ఫలితం తప్పక వరిస్తుందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం హనుమంతులగూడెం గ్రామంలో గ్రామీణ (CITU అనుబంధం) హమాలీల సంఘం, ధాన్యం వ్యాపారుల జాయింట్ సుదీర్ఘ చర్చల అనంతరం సఫలం అయినాయని శీతల రోశపతి అన్నారు.

కాటా ఎగుమతి 24 రూపాయలు ఉండగా నేడు ఇరవై ఏడు రూపాయలకు పెంచుకోవడం జరిగిందని, లారీ మామూలు బస్తాకి ఆరు రూపాయలు, దిగుమతికి 12 రూపాయలు పెంచటం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎస్.కె యాకోబు, కమీషన్ వ్యాపారస్తులు బారెడ్డి సీతారాం రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, లక్ష్మయ్య, మేస్త్రీలు పాత కోటి గురవయ్య, కుక్కల జోజి, వెంకన్న, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెంట్లవేల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి

Satyam NEWS

చోరీ అయిన సింహాచలం శ్రీ అప్పన్న ఇత్తడి కానుకల స్వాధీనం

Satyam NEWS

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఐసోలేషన్‌ కోచ్‌లు రెడీ

Satyam NEWS

Leave a Comment