శ్రమజీవులు ఐక్యంగా పోరాడితే ఫలితం తప్పక వరిస్తుందని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం హనుమంతులగూడెం గ్రామంలో గ్రామీణ (CITU అనుబంధం) హమాలీల సంఘం, ధాన్యం వ్యాపారుల జాయింట్ సుదీర్ఘ చర్చల అనంతరం సఫలం అయినాయని శీతల రోశపతి అన్నారు.
కాటా ఎగుమతి 24 రూపాయలు ఉండగా నేడు ఇరవై ఏడు రూపాయలకు పెంచుకోవడం జరిగిందని, లారీ మామూలు బస్తాకి ఆరు రూపాయలు, దిగుమతికి 12 రూపాయలు పెంచటం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎస్.కె యాకోబు, కమీషన్ వ్యాపారస్తులు బారెడ్డి సీతారాం రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, లక్ష్మయ్య, మేస్త్రీలు పాత కోటి గురవయ్య, కుక్కల జోజి, వెంకన్న, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.