కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ బోరు వ్యవహారం ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. టీడీపీ వైసిపి వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఈ బోరు వ్యవహారంలో బయటపడ్డాయి. ఎప్పుడో పదేళ్ల కిందట పాడుబడిన బోరు తీసేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
గెలిచిన వెంకటసుబ్బయ్య శిరీష లపై అదే గ్రామానికి చెందిన వైసిపి నాయకులు వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం పోలీసులు వారిని స్టేషన్ కి పిలిపించారు. అయితే 4 రోజులు గడువు ఇవ్వమని అడిగిన వారికి ఉదయమే కొత్త బోరు సామగ్రితో పోలీసులు రావడం వివాదానికి కారణం అయ్యింది. దీంతో వెంకట సుబ్బయ్య ,శిరీష దంపతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బోరు వేయటన్ని అడ్డుకున్నారు.
బోరు వేయడం ఖాయమని వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పడంతో వెంకటసుబ్బయ్య అతని భార్య శిరీష పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా వారిని వారించకుండా వెళ్లిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన భార్యాభర్తలు ఇద్దరిని పొద్దుటూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.