శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్ద పాడు గ్రామం లో ప్రాథమిక పాఠశాల కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలో 2 గదులలోనే ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు.
పెద్ద పాడు గ్రామం నుంచి జాతీయ రహదారి మీదుగా ఒక కిలోమీటర్ ప్రయాణించి దూరంగా ఉండే ఉన్నత పాఠశాల చేరుకోవాల్సి వస్తున్నది.
దీంతో విద్యార్థులు విద్యార్థులు, తల్లిదండ్రులు రోజు ప్రాణ భయంతో ఉంటున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇద్దరు ప్రమాద బారిన పడి చనిపోయారు కూడా.
అదేవిధంగా కొంతమంది విద్యార్థులు జాతీయ రహదారి దాటుతుండగా ప్రమాదాల బారిన పడ్డారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఈ పాఠశాల పై దృష్టి సారించి నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.