ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న గ్రామ పంచాయితీ సెక్రెటరీని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగపూర్ లో నేడు ఈ సంఘటన జరిగింది. గ్రామ పంచాయతీ సెక్రెటరీ రామస్వామి ఇంటి అనుమతి మంజూరు కోసం సంకెళ్ళ రాము అనే వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. 5,500 రూపాయలు లంచం తీసుకుంటుగా సాయంత్రం ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.
previous post
next post