40.2 C
Hyderabad
April 24, 2024 18: 44 PM
Slider తూర్పుగోదావరి

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

#Suvarna Jyothi

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మెల్యే పది మందిలో దుర్భాషలాడటంతో ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది.

పురుగుల మందు తాగిన ఆ మహిళా వాలంటీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.

 తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.

కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనను అందరిలో దూషించడం వల్లే మనస్తాపంతో ఈ యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది.

Related posts

అంగన్వాడీల ద్వారా అమలుచేసే కార్యక్రమాలపై అవగాహన

Satyam NEWS

ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో నిలిచిపోయిన డిక్లరేషన్

Satyam NEWS

అక్టోబర్ 11న వస్తున్న ఆర్ డి ఎక్స్ లవ్

Satyam NEWS

Leave a Comment