నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానంలో వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవరాత్రి గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఆలయ స్థానాచార్యులు, ప్రధానార్చకులు, వేదపండితులు, పూజారులచే ముందుగా మట్టి గణేష్ణుణ్ణి పూజించారు.
వినాయక స్వామిని ప్రతిష్టించి విశేష పూజ చేసి ప్రపంచంలో ఉన్న మహమ్మారి కోవిడ్-19 తొందరగా తొలగిపోవాలని కోరుకున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలు ,భారతదేశం లో ఉన్న ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆచార్యులు కోరుకున్నారు.
అందరికి విఘ్నాలను తొలగించి అష్టఐశ్వర్యములు ఇవ్వాలని సిద్ధి వినాయకుడిని వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమములో ఆలయ చైర్మన్, ఆలయ సిబ్బంది, వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది, హోమ్ గార్డ్ సిబ్బంది, భక్తులు అందరు భౌతిక దూరాన్ని పాటిస్తూ పాల్గొన్నారు.