25.7 C
Hyderabad
January 15, 2025 17: 47 PM
Slider కరీంనగర్

సజెషన్: గెలిచిన వారు పదవులకు వన్నె తేవాలి

vinodkumar

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైన  వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక అనంతరం కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించి పదవులకు వన్నె తేవాలని వినోద్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్ లకు సూచించారు.

కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధి కోసం పాటు పడాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని, అభివృద్ధికి కంకణ బద్ధులు కావాలని వినోద్ కుమార్ సూచించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని,  శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) ద్వారా నగర అభివృద్ధి కి కృషి చేయాలని, మాస్టర్ ప్లాన్, మానేరు రివర్ ఫ్రంట్ వంటి అంశాలపై దృష్టి సారించాలని వినోద్ కుమార్ సూచించారు.

Related posts

ఈడ్పుగంటి పద్మజారాణి పంచాంగం: సత్యం న్యూస్ ప్రత్యేకం(వీడియో)

Satyam NEWS

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దొరల గడీలో బందీ

Satyam NEWS

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment