35.2 C
Hyderabad
April 20, 2024 15: 34 PM
Slider విజయనగరం

రామతీర్థం బొడికొండకు ప్రముఖుల తాకిడి

#Ramateerdham

విజయనగరం జిల్లా రామతీర్థం లో బొడికొండపై జరిగిన ఘటన రాష్ట్ర మంతటా కదిలిస్తోంది. అటు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన నెల్లిమర్ల పోలీసులు నిందితులను పట్టుకునే వేటలో ఉండగా మరోవైపు జిల్లా ఎస్పీ ఇప్పటికే మూడు సార్లు కొండపైకి ఎక్కి…కేసును స్వయంగా పరిశోధనలో పడ్డారు.

మరోవైపు కొండపై జరిగిన ఘటన అటు రాజకీయం ఊపందుకుంది. తొలుత అధికార పార్టీ ఎమ్మెల్యే బొడికొండపై వెళ్లగా..తర్వాత పలువురు నేతలు వెళ్లారు. ఇవాళ ప్రతిపక్ష నేత చంద్రబాబు వస్తుండగా…అధికార పార్టీ నేతలలో మరింత చలనం పుట్టింది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం రానున్నారు. అలాగే ఘటన జరిగినప్పటి నుంచీ బీజేపీ నేతలు అక్కడే టెంట్లు వేసుకుని ధర్నా చేస్తుండగా సరాసరి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా రామతీర్థం వస్తున్నట్టు సమాచారం.

నేతల తాకిడి పెరగడం తో విజయనగరం అంతటా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు…జిల్లా ఎస్పీ.ఇప్పటికే ఏఆర్ డీఎస్పీ శేషాద్రి కొండపై బందోబస్తు నిమిత్తం ఉండగా మరో వైపు వారి సిబ్బంది కూడా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఏదైనా రామతీర్థం బొడికొండపై జరిగిన ఘటన యావత్ రాష్ట్రాన్నే కాక దేశం యావత్తు కదిలిస్తోంది.

Related posts

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

Satyam NEWS

భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Satyam NEWS

10 సీట్లు మావే

Murali Krishna

Leave a Comment