27.7 C
Hyderabad
March 29, 2024 01: 16 AM
Slider క్రీడలు

మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన కోహ్లీ

తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మళ్లీ స్టెప్పులేశాడు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో బౌలర్లను ఉత్సాహపరుస్తూ కాలు కదిపాడు. కాగా దక్షిణాఫ్రికాతో తొలిటెస్టులో కే ఎల్‌ రాహుల్‌ శతకం బాదిన సంగతి తెలిసిందే.

అయితే రెండో రోజూ పూర్తి ఆట వర్షార్పణమైంది. ఇక మూడో రోజైతే రాహుల్‌ అందించిన ఆరంభాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రొటీస్ బౌలర్ల ధాటికి కొద్దిసేపైనా క్రీజులో నిలవలేకుండా పెవిలియన్‌ చేరారు. దీంతో అభిమానులు ఎంతో నిరుత్సాహపడ్డారు.

అయితే మొదటి ఇన్సింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు నేలకూల్చారు. ఆతిథ్య జట్టును 197 పరుగులకే పరిమితం చేశారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ మధ్యలో బౌలర్లను ఉత్సాహపరుస్తూ మైదానంలోనే డ్యాన్స్‌ వేశాడు కెప్టెన్‌ కోహ్లీ.

Related posts

గ్రీవియన్స్ సెల్ ఫిర్యాదులకు సత్వర న్యాయం

Sub Editor

క‌రోనాపై కేంద్రం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు!

Sub Editor

సుప్రీం కోర్టు లో వనమా కు వూరట

Bhavani

Leave a Comment