భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన మ్యాచ్కి సంబంధించిన అతని వీడియో ఒకటి ప్రస్తుతం చాలా వైరల్గా మారింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పడు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పాడిన ‘మై నేమ్ ఈజ్ లఖన్’ అనే ఫేమస్ సాంగ్ స్టేడియంలో ప్లే కావడం మొదలైంది.
విరాట్ కోహ్లి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ కోసం వచ్చాడు. ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఇది చూసిన అభిమానులు కూడా కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ వీడియో ఇంటర్నెట్లో చేరిన తరువాత వైరల్గా మారింది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించి, షేర్ చేశారు.
ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2016 టీ20 ప్రపంచకప్, అదే ఏడాది జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. విశేషమేమిటంటే 2016లో కూడా ఇదే పాటకు డ్యాన్స్ చేశాడు.