30.7 C
Hyderabad
April 19, 2024 09: 44 AM
Slider ఆధ్యాత్మికం

న‌వంబ‌రు 29న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌

#TiruchanurPadmavati

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబ‌రు 8వ‌ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని  పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 29వ తేదీన సోమ‌వారం వ‌ర్చువ‌ల్‌ విధానంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1,116/-గా టిటిడి నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే ఈ టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహ‌స్తులు 90 రోజుల్లోపు రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ‌ద‌ర్శ‌న క్యూలైన్‌లో ఉచితంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శన‌ స‌మ‌యంలో గృహ‌స్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

Related posts

వరి పంటకు వస్తున్న తెగుళ్లపై రైతుల ఆందోళన

Satyam NEWS

ఖమ్మం బహిరంగ సభకు భారీగా తరలిన టిడిపి శ్రేణులు

Satyam NEWS

తెలంగాణ ఉద్యమంతో బతుకమ్మకు గుర్తింపు

Satyam NEWS

Leave a Comment