విశాఖ నగరంలోని మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్ ను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. అది టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాధ్ కి చెందినది.
ఆయన వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే అధికారులు కాశీ విశ్వనాథ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారుంటూ తొలగిస్తున్నారు.
ఇది పూర్తిగా ప్రైవేటు భూమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కాశీ విశ్వనాథ్ అంటున్నారు. అయినా అధికారులు వినడం లేదు.
గంటా వైసీపీలో చేరిక అంశంలో విశాఖలో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.