ఈ నెల 5 నుంచి విశాఖ – గుణుపూర్ ఫాస్ట్ పాసింజర్ రైలు పట్టాలు ఎక్కనుంది. అదే విధంగా ఈ నెల 23వ తేదీ నుంచి పూరి – గుణుపూర్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా తిరిగి ప్రారంభం కానున్నది.
ఈ రెండు రైళ్లు గత ఏడాది లాక్ డౌన్ ప్రారంభం అయిన నుండి సరిగ్గా సంవత్సరం పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఈ రెండు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీన విశాఖ – గుణుపూర్, ఏప్రిల్ 23వ తేదీన పూరి – గుణుపూర్ ఈ రెండు రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.