హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శారాదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి…విజయనగరం జిల్లాకు వచ్చారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో పర్యటించిన స్వామిజీ ఆలయాల ధ్వంసం..వాటి దుస్థితి స్పందించారు. అక్కడ నుంచీ విజయనగరం జిల్లా రామతీర్ధంకు వచ్చిన అనంతరం నగర శివారులో..పూల్ బాగ్ రోడ్ లోని కుసుమ హరనాథ్ క్షేత్రం వద్ద విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్ఎల్సీ డాక్టర్ పి.వి సూర్యనారాయణ రాజు, ధార్మిక సేవా సంస్థల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
గజమాలతో ఎమ్మెల్యే కోలగట్ల స్వామి వారిని సత్కరించారు. అనంతరం ఆయన స్టేడియం రోడ్ లో ఉన్న క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం కు చేరుకున్నారు. సాయంత్రం…సమయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శీను) స్వామిజీని కలిసారు.
ఈ నెల 24 న సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వాత్మ నం దేoద్ర స్వామివారు పాల్గొంటారు. స్వామివారికి ఆహ్వానం పలికిన వారిలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు , శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం బోర్డు సభ్యులు, జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, ఆయా ఆధ్యాత్మిక సేవా సంస్థల ప్రతినిధులు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారు..