కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావుకు 3వ కరోనా వారియర్ అవార్డు దక్కింది.
జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన అందరి ప్రశంసలు పొందారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పూటగడవని పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు, కూరగాయలు, వ్యాధి నిరోధక శక్తి పెంచే ప్రొటినెక్స్ డబ్బాలను ఆయన పంపిణీ చేశారు.
వృద్ధులకు ఆయన మందులు కూడా పంచి పెట్టారు. ఈ సేవా కార్యక్రమాలతో ఆయన కరోనా సేవకుడిగా గుర్తింపు పొందారు.
ఇదే సమయంలో ఆయన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు 2021 కోనా శ్రీనివాసరావుకు దక్కింది.
మొత్తం నాలుగు కేటగిరీలకు ఎంపిక చేయగా 3 వ కరోనా వారియర్ అవార్డు, సోషల్ సర్వీస్ విభాగంలో కోనా శ్రీనివాసరావుకు దక్కింది.