39.2 C
Hyderabad
April 18, 2024 18: 04 PM
Slider ప్రకాశం

విశ్వసేవిక ట్రస్ట్ వృద్ధాశ్రమంలో నిత్యావసరాల పంపిణీ

#Viswasevika Trust

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు విశ్వసేవిక ట్రస్ట్ వృద్దాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు,

ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్ర రావు మాస్టర్, సూపర్ బజార్ ఛైర్మన్ వేమూరి బుజ్జి, కటారి శంకర్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు గంగాడ సుజాత, అరుణ, చెన్నకేశవ స్వామి ఆలయ పాలక వర్గ చైర్మన్ ఈదుపల్లి గుర్నాధం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిద్దా సుధీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసారని,నవ రత్నాల పధకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల మనసును గెలుచుకున్న జననేత అని అన్నారు.

ప్రజాధారణ  పొందిన గొప్ప నాయకుడుగా ముఖ్యమంత్రి పేరు తెచ్చుకున్నారని, నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

Related posts

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రంగంలో దిగిన సీఎం కేసీఆర్‌

Satyam NEWS

తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలి

Bhavani

ఆర్టీసీ సమ్మెపై మరిన్ని కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment