ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేటి నుంచి సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభం అయింది.
6 మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం చేరుకున్నది.
ఇప్పటికే పలు దఫాలుగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సీబీఐ విచారణ జరిపింది.
నేడు మరోసారి పలువురు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.