32.7 C
Hyderabad
March 29, 2024 12: 07 PM
Slider అనంతపురం

వివేకా హత్య కేసులో సీబీఐ పై ఫిర్యాదు చేసిన గంగాధర్ రెడ్డి

#YSVivekanandareddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని సీబీఐ అధికారులు తనపై వత్తిడి తెస్తున్నారని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పకు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లు సాక్ష్యం ఇచ్చేందుకు అంగీకరిస్తే 10 కోట్ల ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసింది గంగాధర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల సీబీఐ అధికారుల నుంచి, వివేకానందరెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని గంగాధర్ రెడ్డి కోరారు.

Related posts

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Satyam NEWS

ఆపద కాలంలో అండగా నిలిచిన బాల్య మిత్రులు

Satyam NEWS

జర్నలిస్టు భూమేష్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

Satyam NEWS

Leave a Comment