ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెప్పాలని సీబీఐ అధికారులు తనపై వత్తిడి తెస్తున్నారని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పకు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాము చెప్పినట్లు సాక్ష్యం ఇచ్చేందుకు అంగీకరిస్తే 10 కోట్ల ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసింది గంగాధర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల సీబీఐ అధికారుల నుంచి, వివేకానందరెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని గంగాధర్ రెడ్డి కోరారు.
previous post
next post