విశాఖపట్నం జిల్లా భీమిలీ మండలం అవనం గ్రామం సమీపంలోని హైగ్రీవ్ రిసార్ట్స్ లో గుట్టు చప్పుడు కాకుండా ‘‘గుడివాడ కాసినో’’ నడుస్తున్నది. రహస్యం గా నడుస్తున్న ఈ భారీ పేకాట శిబిరంపై సెబ్ అధికారులు మెరుపుదాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న వారి నుంచి 5 లక్షల 70 వేల 270 రూ. నగదుతో పాటు పేకాటరాయుళ్లను చాకచక్యం పట్టుకున్నారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమీషనర్ బాబ్జీ రావు, అసిస్టేంట్ కమీషనర్ రామచంద్రరావు , సిటీ జెడి సతీష్ కుమార్ ఐపిఎస్ , ఎన్ఫోర్స్మెంట్ అసిస్టేంట్ సూపరిడెంట్ శ్రీనాధుడు అదేశాలు మేరకు ఇనస్పెక్టర్లు పి.అప్పలరాజు, నమ్మి గణేష్ జగదీష్ లు, ఎస్సైలు సంతోష్ , ఖగేష్, ఆమాన్ రావు, జ్ఞానేశ్వరీ, పద్మవతి ఆధ్వర్యంలో భారీ పేకాట డెన్ పై మెరుపుదాడులు నిర్వహించారు.
నగదు తో పాటు 9 కార్లు , 23 సెల్ ఫోన్లు పాటు 22 మంది జూదరులను అధికారులు అదుపులోకి తీసుకుని భీమిలీ పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. అయితే అధికారుల దాడుల సమయంలో నిర్వాహకులు తెలివిగా నగదుతో పాటు వాడుకలలో ఉంచిన కాయిన్స్ ను కూడా సెబ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం విశేషం.
పది వేల రూపాయుల కాయిన్స్ – 123, ఐదు వేల రూపాయుల కాయిన్స్ – 179, రెండు వేల రూపాయుల కాయిన్స్ – 9, వెయ్యి రూపాయుల కాయిన్స్ – 10 కాయిన్స్ మొత్తం 321 కాయిన్స్ ను పోలీస్లు స్వాధీనం చేసుకున్నారు.