బూతులు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు బుద్ధి నేర్పబడును అంటూ విశాఖ టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ల మాస్క్ లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ స్కూల్ లో బుద్ధి, జ్ఞానం నేర్పబడును అనే ఆలోచన ద్వారా నిరసన వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీ లో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తి గత దూషణ లు, బూతులు మాట్లాడటం తగదనే విషం కూడా వారికి తెలియడం లేదని నిరసనకారులు తెలిపారు. ప్రజాస్వామ్య లో మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు బూతుల మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా ఈ వైసీపీ నేతల బుద్ధిలో మార్పు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి ఆధ్వర్యంలో జరిగి ఈ నిరసన కార్యక్రమంలో బోయి రమాదేవి, పల్లా ఉమారాణి, లక్ష్మీ లావణ్య, రమణమ్మ, సమ్మిడి ఉమా, గోడి అరుణ, నూరి, మంగమ్మ, కుమారి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.
previous post