వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన జర్నలిస్టుల ( విజేఫ్ )పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావులు తెలిపారు.
డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల తో మాట్లాడుతూ కరోనా ను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ మాసంలో జర్నలిస్టుల పిల్లలకు ఉపకారవేతనాలు, ప్రతిభ గల జర్నలిస్టులకు మీడియా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు.
అయితే ఉపకారవేతనాలకు ఆగస్టు నెలాఖరులో గా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. త్వరలో జర్నలిస్టులకు సంబంధించి ఆధార్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో ఆధార్ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ వాటికి సంబంధించిన సవరణలు, కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడానికి ఈ మేళా ఉపకరిస్తుంది అన్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా ను దృష్టిలో ఉంచుకొనే ఆయన కార్యక్రమములు నిర్వహణ తేదీలను ఖరారు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో విజేఫ్ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, టీ. నానాజీ, జాయింట్ సెక్రెటరీ దాడి రవి కుమార్, కోశాధికారి పి ఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు ఎమ్.ఎస్ అర్ ప్రసాద్ వరలక్ష్మి, దివాకర్, దొండ గిరిబాబు, శేఖర్ మంత్రి, డేవిడ్, మాధవ్ రావు, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.