27.7 C
Hyderabad
April 19, 2024 23: 42 PM
Slider కృష్ణ

వైసీపీ నాయకుడి వేధింపులతో వీఓఎ అధ్యక్షురాలు ఆత్మహత్య

#suicide

కృష్ణా జిల్లా లో ఘోరం జరిగింది. వీఓఎల సంఘం బందరు మండల అధ్యక్షురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. వేరే ఏదో కారణం కాదు. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గరికపాటి నరసింహరావు వేధింపులు కారణమని చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుడి వేధింపులు తాళలేక తన స్వగ్రామం భోగిరెడ్డిపల్లిలో నాగలక్ష్మి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు చెబుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అధికార పార్టీ నేత వేధింపులపై నెల రోజుల క్రితమే నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాగలక్ష్మి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా వేధింపులు అధికమయ్యాయి. దాంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Related posts

గౌతమ బుద్ధుడి బాట నేటి సమాజానికి ఆచరణీయం

Satyam NEWS

గేట్ ధర్నా కు దిగిన కల్వకుర్తి న్యాయవాదులు

Satyam NEWS

ఓమ్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా కోటోజు జ్యోతి రాణి

Satyam NEWS

Leave a Comment