సిర్పూర్ బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో BJYM చింతలమనేపల్లిలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 27 జట్లు పాల్గొన్నాయి.
ఈ పోటీల్లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచులు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు JB పౌడెల్,డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్లు హాజరై విజేత చింతలమనేపల్లి జట్టుకు మొదటి బహుమతి, చింతలమనేపల్లి A టీమ్ 10,000 పదివేలు, దీతీయ బహుమతి, చింతలమనేపల్లి B టీమ్ 5000 ఐదువేలు, మూడవ బహుమతి తలయి 2000 రెండువేల రూపాయలను శ్రీనివాస్, పౌడెల్లు అందించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ క్రీడల వల్ల కొత్త స్నేహితులు పరిచయం అవుతారని రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి కబ్బాడ్డి పోటీలు కూడా నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మెన్ సిడం గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, చింతలమనేపల్లి మండల అధ్యక్షులు ధోని శ్రీశైలం, దహెగం మండల అధ్యక్షులు సురేష్, కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, మందడే సుధాకర్, కార్తిక్ పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు