27.7 C
Hyderabad
April 26, 2024 04: 35 AM
Slider చిత్తూరు

పబ్లిసిటీ విడిచిపెట్టి కరోనా పని చూడండి

#KiranRayal

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సొంత పబ్లిసిటీ విచిపెట్టి కరోనాపై దృష్టి సారించాలని తిరుపతి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి కిరణ్ రాయల్ కోరారు.

వార్డు సచీవాలయాలను వైసీపీ పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం లాంటి చర్యలను ఇప్పటికైనా పక్కన పెట్టాలని ప్రజా శ్రేయస్సు పై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.

కరోనా తీవ్రతను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రజలు వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్ సెంటర్ల వద్ద బారులు తీరడం వల్ల కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందని కిరణ్ రాయల్ అన్నారు.

కరోనా వేవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర స్థాయిలో ఆరోగ్య విపత్తు నెలకొందని ఆయన అన్నారు.

మహమ్మారి విజృంభించిన ఈ పరిస్థితుల్లో తక్షణమే వార్డు సచీవాలయాలను హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లుగా మార్చాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

వాలంటీర్లను వైసీపీ పనులకు కాకుండా ఈసారి అయినా ప్రజల కోసం పని చేయించాలని ఆయన కోరారు.

Related posts

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి రోజా

Satyam NEWS

నెహ్రూ విధానాలే సర్వదా ఆచరణీయం

Bhavani

కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్న జగన్

Bhavani

Leave a Comment